Kashmir Encounter: కరోనా కల్లోలంలో తెగబడిన ఉగ్రవాదులు, 9 మంది తీవ్రవాదులను హతమార్చిన భారత సైన్యం, నేలరాలిన భారత జవాను, ఇద్దరికి గాయాలు

కరోనా భయంతో (Coronavirus) తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే కాశ్మీర్ లో ఉగ్రవాదులు (terrorists) తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌తో (Kashmir Encounter) ఉలిక్కిపడింది. ఉగ్ర దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపద్రవం ముంచుకొస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో అలెర్ట్ అయిన భారత సైన్యం 9 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టింది.

Kashmir Encounter: కరోనా కల్లోలంలో తెగబడిన ఉగ్రవాదులు, 9 మంది తీవ్రవాదులను హతమార్చిన భారత సైన్యం, నేలరాలిన భారత జవాను, ఇద్దరికి గాయాలు
Representational Image (Photo Credits: PTI)

Srinagar, April 5: కరోనా భయంతో (Coronavirus) తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే కాశ్మీర్ లో ఉగ్రవాదులు (terrorists) తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌తో (Kashmir Encounter) ఉలిక్కిపడింది. ఉగ్ర దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపద్రవం ముంచుకొస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో అలెర్ట్ అయిన భారత సైన్యం 9 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టింది.

పోలీసులపై పూల వర్షం

గత 24 గంటల్లో కాశ్మీర్ లోయలో తొమ్మిది మంది ఉగ్రవాదులను భారత సైన్యం (Army Soldier) కాల్చి చంపినట్లు ఆర్మీ వర్గాలు ఆదివారం తెలియజేశాయి. ANI చేసిన ట్వీట్ ప్రకారం.. హతమార్చిన తొమ్మిది మంది ఉగ్రవాదులలో దక్షిణ కాశ్మీర్‌లోని బత్పురాలో శనివారం నలుగురు మృతి చెందగా, జమ్మూ కాశ్మీర్‌లోని కేరన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంట మరో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. కేరన్ సెక్టార్లో చంపబడిన ఉగ్రవాదులు నియంత్రణ రేఖ నుండి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగా మట్టుబెట్టామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Take a Look at the Tweets:

ఆపరేషన్ సమయంలో, ఒక భారతీయ ఆర్మీ సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ మంచు మరియు కఠినమైన భూభాగ పరిస్థితుల కారణంగా గాయపడిన వారిని తరలించే కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఎఎన్ఐ వెల్లడించింది. ఆపరేషన్ ఇంకా పురోగతిలో ఉంది.

17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్‌ మత ప్రకంపనలు

కాగా ఈ నెల ప్రారంభంలో, జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగా నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రర్ గ్రూపుకు చెందిన నలుగురు ఉగ్రవాదులు బార్డర్ లోకి వస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో సైన్యం ఈ ఏడాది ఫిబ్రవరిలో వారిని మట్టుబెట్టింది. 2020 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 25 మంది ఉగ్రవాదులు హతమయ్యారని జెఅండ్‌కె డిజిపి దిల్‌బాగ్ సింగ్ చెప్పారు. 12 విజయవంతమైన ఆపరేషన్లు జరిగాయని, ఇందులో 25 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 40 మందికి పైగా భూగర్భ కార్మికులు కూడా అరెస్టు చేయబడ్డారని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Apr 05, 2020 11:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).