Indian Army: ఇండియన్ ఆర్మీలో 8 మందికి కరోనా, చికిత్స తీసుకుంటున్న న‌లుగురు జ‌వాన్లు, ల‌డ‌క్ సెక్టార్‌లో కోవిడ్-19 నుంచి కోలుకున్న జవాన్, వెల్లడించిన ఆర్మీ చీఫ్ నారావణే

మ‌న‌దేశ సైన్యంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఆర్మీ అంటే ఎంత క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా మ‌న సైన్యంలో ఇప్పటివరకు 8 పాజిటివ్ కేసులు (Indian Army Has 8 Coronavirus Positive Cases ) న‌మోదు అయ్యాయి. ఈ ఎనిమిది మందిలో ఇద్ద‌రు వైద్యులు, ఒక‌రు న‌ర్సింగ్ అసిస్టెంట్ ఉన్నార‌ని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇదే టైంలో క‌రోనా సోకిన న‌లుగురు జ‌వాన్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇక ల‌డ‌క్ సెక్టార్‌లో క‌రోనా సోకిన ఓ జ‌వాన్ పూర్తిగా కోలుకున్నార‌ని కూడా వారు తెలిపారు. ఆ జ‌వాన్ కోలుకుని విధుల్లో చేర‌డం కూడా జ‌రిగింద‌ని కూడా ఆర్మీ అధికారులు చెప్పారు.

Indian Army: ఇండియన్ ఆర్మీలో 8 మందికి కరోనా, చికిత్స తీసుకుంటున్న న‌లుగురు జ‌వాన్లు, ల‌డ‌క్ సెక్టార్‌లో కోవిడ్-19 నుంచి కోలుకున్న జవాన్, వెల్లడించిన ఆర్మీ చీఫ్ నారావణే
Chief of Army Staff General Manoj Mukund Naravane. (Photo Credit: ANI)

Jammu and Kashmir, April 17: ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనావైరస్ (coronavirus) భారీన ప‌డ‌ని దేశం అంటూ లేదు. కేవలం ఐదారు దేశాలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా భారీన ప‌డ‌లేదు. అందులో మ‌కావు, ఉత్త‌ర కొరియా, తుర్క్‌మెనిస్తాన్‌, క‌జ‌కిస్తాన్, లెసెతో దేశాలు మాత్ర‌మే ఇప్పటివరకు క‌రోనా భారీన ప‌డ‌లేదు. మ‌న‌దేశంలో కరోనా (COVID-19) రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 13 వేల మందికి పైగానే క‌రోనా భారీన ప‌డ్డారు. ఇక 437 మంది చ‌నిపోయారు. ఆగని కరోనా మరణాలు, దేశ వ్యాప్తంగా 437 మంది మృతి, 13 వేలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు

ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో మ‌న‌దేశ సైన్యంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఆర్మీ అంటే ఎంత క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా మ‌న సైన్యంలో ఇప్పటివరకు 8 పాజిటివ్ కేసులు (Indian Army Has 8 Coronavirus Positive Cases ) న‌మోదు అయ్యాయి. కోవిడ్-19 రహిత రాష్ట్రంగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌

ఈ ఎనిమిది మందిలో ఇద్ద‌రు వైద్యులు, ఒక‌రు న‌ర్సింగ్ అసిస్టెంట్ ఉన్నార‌ని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇదే టైంలో క‌రోనా సోకిన న‌లుగురు జ‌వాన్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇక ల‌డ‌క్ సెక్టార్‌లో క‌రోనా సోకిన ఓ జ‌వాన్ పూర్తిగా కోలుకున్నార‌ని కూడా వారు తెలిపారు. ఆ జ‌వాన్ కోలుకుని విధుల్లో చేర‌డం కూడా జ‌రిగింద‌ని కూడా ఆర్మీ అధికారులు చెప్పారు.

Here's what Army Chief Gen MM Naravane spoke during his interaction with ANI:

ఏదైనా కరోనా సోకిన వ్యక్తితో సంబంధం లేని సిబ్బందిని తిరిగి యూనిట్లకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ దాడులను ప్రస్తావిస్తూ, నారావణే మాట్లాడుతూ, "ఇండియన్ ఆర్మీ దేశ స్వంత పౌరులకు సహాయం చేయటంలోనే కాకుండా, మిగతా ప్రపంచానికి వైద్య బృందాలను పంపడం మరియు ఔషధాలను ఎగుమతి చేయడం ద్వారా బిజీగా ఉంది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మాత్రమే ఎగుమతి చేస్తోందని తెలిపారు.

ఎవరీ నూతన సైన్యాధిపతి మనోజ్‌ ముకుంద్‌?

కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి లాక్డౌన్ పొడిగింపు దృష్ట్యా ఏప్రిల్ 19 వరకు బలగాల కదలికలు లేకుండా చూసుకోవాలని భారత సైన్యం తన సైనిక స్థావరాలు, కంటోన్మెంట్లు, ఏర్పాటు ప్రధాన కార్యాలయాలు మరియు యూనిట్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం 13,387 కు పెరగగా, మరణాల సంఖ్య 437 కు పెరిగింది.

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌కు కీలక బాధ్యతలను అప్పగించిన కేంద్రం, భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్‌గా జనరల్‌గా నియామకం

ఆర్మీ ప్రధాన కార్యాలయంలో, సైనిక కార్యకలాపాలు, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఆపరేషనల్ లాజిస్టిక్స్ మరియు వ్యూహాత్మక ఉద్యమాలను నిర్వహించే రెక్కలు ఏప్రిల్ 19 వరకు కనీస సిబ్బంది బలంతో పనిచేయడం కొనసాగుతుంది. కరోనావైరస్ మహమ్మారిలో మహారాష్ట్ర తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత ఢిల్లీ. తమిళనాడులో కూడా కేసులు పెరుగుతున్నాయి.

(The above story first appeared on LatestLY on Apr 17, 2020 02:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).