
హిందువులు అత్యంత ముఖ్యమైన పండుగ స్. ఈ ఏడాది 2025లో ధన త్రయోదశి (Dhantrayodashi) అక్టోబర్ 18 శనివారం జరగనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1. 54 గంటలకు ముగుస్తుంది. ఇది ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచించే అత్యంత శుభప్రదమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా దీపావళి 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. లక్ష్మీపూజ, ధన సంపద, ఆర్థిక శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తుంది.
ధన త్రయోదశి రోజున భక్తులు భక్తి, శ్రద్ధ, నియమ నిష్టలతో లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తారు. ఈ పూజ ద్వారా అదృష్టం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం వచ్చే నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ రోజు బంగారం, వెండి, రాగి, పంచ లోహ పాత్రలు వంటి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేయడం ద్వారా వచ్చే సంపద, శ్రేయస్సు సారం సంవత్సరాంతం నిలుస్తుందని నమ్మకం ఉంది. దంతేరస్ సందర్భంగా శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి





ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కల్గించాలని కోరుకుంటూ ధన త్రయోదశి శుభాకాంక్షలు..