Bomb Threat Panic: విమానంలో బాంబు బెదిరింపులు.. భయాందోళనకు గురయిన ప్రయాణీకులు.. చెన్నైలో ఘటన (వీడియో)
చెన్నై ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో తన వద్ద బాంబు ఉందని, పేల్చేస్తామని ఓ ప్రయాణీకుడు బెదిరించడంతో తోటి ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Chennai, Jan 26: చెన్నై ఎయిర్ పోర్టులో (Chennai Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం రేపింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో తన వద్ద బాంబు ఉందని, పేల్చేస్తామని ఓ ప్రయాణీకుడు బెదిరించడంతో తోటి ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు ఈ విషయాన్ని చెన్నై ఎయిర్ పోర్టు భద్రతా అధికారులకు తెలియజేశారు. చెన్నై విమానాశ్రయంలో విమానం లాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేశారు.
అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం, ఆకట్టుకుంటున్న సైనిక లోగో, వీడియో ఇదిగో
Here's Video:
చెన్నైవిమానంలో ప్రయాణికుల గొడవ..
బాంబులు ఉన్నాయని బెదిరింపు, భయాందోళనలో ప్రయాణికులు
కొచ్చినుంచి చెన్నై వస్తున్న విమానంలో ఘటన
అర్దరాత్రి 12గంటల నుంచి తెల్లవారజామున వరకు తనిఖీలు
బాంబు బెదిరింపు వెనుక కారణం ఏమిటి? అని కొనసాగుతోన్నా విచారణ. pic.twitter.com/mB0pTWDRNP
— ChotaNews App (@ChotaNewsApp) January 26, 2025
ఇద్దరి అరెస్ట్
ఆదివారం వేకువజామున ఐదు గంటల ప్రాంతానికి తనిఖీలు పూర్తి చేసిన భద్రత అధికారులు బాంబు లేదని తేల్చారు. కాగా, ప్రయాణీకులను భయాందోళనకు గురిచేసిన అమెరికా, కేరళ ప్రయాణీకులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్ చూశారా?
(The above story first appeared on LatestLY on Jan 26, 2025 11:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

