Ex-Ranji Cricketer Arrested: సీఎం జగన్ పీఏనంటూ ముంబై వ్యాపారికి రూ.12 లక్షలు టోకరా, మాజీ రంజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినంటూ ముంబై వ్యాపారిని బురిడీ కొట్టించిన మాజీ రంజీ క్రికెటర్‌ నాగరాజును ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ (Ex Ranji Cricketer Arrested) చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల బుడుమూరు నాగరాజు ఆంధ్రప్రదేశ్‌ మాజీ రంజీ క్రికెటర్‌.

Ex-Ranji Cricketer Arrested: సీఎం జగన్ పీఏనంటూ ముంబై వ్యాపారికి రూ.12 లక్షలు టోకరా, మాజీ రంజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు
Ex Ranji Cricketer Nagraju Budumuru Arrested For Posing as Andhra Pradesh Chief Minister And Duping Company of Rs 12 Lakh

Amaravati, Mar 16: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినంటూ ముంబై వ్యాపారిని బురిడీ కొట్టించిన మాజీ రంజీ క్రికెటర్‌ నాగరాజును ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ (Ex Ranji Cricketer Arrested) చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల బుడుమూరు నాగరాజు ఆంధ్రప్రదేశ్‌ మాజీ రంజీ క్రికెటర్‌.

అలాగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ ప్లేయర్‌. ఆంధ్రప్రదేశ్‌ రంజీ ఆటగాడు రికీ భుయ్‌కు రూ.12 లక్షల స్పాన్సర్‌షిప్ (Duping Company of Rs 12 Lakh) కావాలని ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి ఫోన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ (Andhra Pradesh Chief Minister) వ్యక్తిగత సహాయకుడినంటూ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ), ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రికీ భుయ్‌ల పేర్లు వాడుకుని సొమ్మును కాజేశాడు.

ముంబైలో ఏడు అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం, ముగ్గురు చిన్నారులు సహా పది మందికి గాయాలు, 80 మందిని రక్షించిన అధికారులు

పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన నాగరాజు.. గతంలో ఓ రాజకీయ నాయకుడు చేసిన మోసం వల్ల తాను ఈ తరహా మోసాలకు అలవాటు పడినట్లు తెలిపాడు. ఇక 2021లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శినంటూ పలు కార్పొరేట్ కంపెనీలను రూ. 40 లక్షలు వరకు మోసగించినందుకు అరెస్టయ్యాడు. నాగరాజు 2018 నుంచి ఇప్పటి వరకు స్పాన్సర్‌షిప్‌ పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 60కిపైగా కంపెనీలను రూ.3 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

చెప్పుల కింద రూ. 70 లక్షల బంగారం, అక్రమంగా తరలిస్తూ ఇండిగో విమానంలో పట్టుబడిన ప్రయాణికుడు, అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు

ఎంబీఏ చదువుకున్న నాగరాజు 2014-2016 మధ్యలో ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు (రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో), 2016-2018 మధ్యలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఇండియా-బి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.  2016లో క్రికెట్‌కు సంబంధించి సుదీర్ఘ సమయం నెట్ సెషన్‌లో పాల్గొన్న బ్యాటర్‌ విభాగంలో  గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

(The above story first appeared on LatestLY on Mar 16, 2023 12:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).