Andhra Pradesh: ఉన్నతాధికారులతో సీఎం జగన్ కీలక సమావేశం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.
Vjy, Sep 12: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.
చంద్రబాబును అరెస్టు చేసే క్రమంలో జరిగిన ప్రతి అంశాన్ని జగన్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ సమావేశంలో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 12, 2023 03:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

