CM Jagan to Visit Konaseema: రేపు సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే.., గోదావరి వరద ప్రాంతాల బాధితులతో నేరుగా మాట్లాడనున్న ఏపీ ముఖ్యమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతం కోనసీమ జిల్లాలో (CM Jagan to Visit Konaseema) పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.

CM Jagan to Visit Konaseema: రేపు సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే.., గోదావరి వరద ప్రాంతాల బాధితులతో నేరుగా మాట్లాడనున్న ఏపీ ముఖ్యమంత్రి
CM YS Jagan (Photo-Twitter)

Amaravati, July 25: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతం కోనసీమ జిల్లాలో (CM Jagan to Visit Konaseema) పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారని సీఎంఓ కార్యాలయం తెలిపింది.

అనంతరం అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను (CM Jagan to visit flood-hit villages) కలుస్తారు, అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు.

వరద బాధితులకు అండగా.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 5 కోట్లు విరాళం ఇచ్చిన APMDC

అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు

(The above story first appeared on LatestLY on Jul 25, 2022 05:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).