Nandi Idol Stolen: నెల్లూరు జిల్లాలో నంది విగ్రహం మాయం, తూర్పుకంభంపాడు నీలకంఠ ఈశ్వరాలయంలో రాతి నందిని చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుకంభంపాడు శివాలయంలో చోరీ (Nandi Idol Stolen) జరిగింది. అర్ధరాత్రి శివాలయం వద్దకు చేరుకున్న దొంగలు పురాతన నీలకంఠ ఈశ్వరాలయంలో ( Shiva Temple in Nellore) రాతి నంది విగ్రహాన్ని పెకలించి చోరీ చేసుకుని తీసుకెళ్లారు. ఉదయం గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Nellore, Sep 17: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుకంభంపాడు శివాలయంలో చోరీ (Nandi Idol Stolen) జరిగింది. అర్ధరాత్రి శివాలయం వద్దకు చేరుకున్న దొంగలు పురాతన నీలకంఠ ఈశ్వరాలయంలో ( Shiva Temple in Nellore) రాతి నంది విగ్రహాన్ని పెకలించి చోరీ చేసుకుని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చేజర్ల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హనీఫ్ ANI తో మాట్లాడుతూ, "బుధవారం రాత్రి, కొంతమంది దుండగులు చేజర్ల మండలంలోని T.K పాడు గ్రామంలోని పురాతన నీలకంఠేశ్వర దేవాలయం ఆవరణలో పీఠంపై ఏర్పాటు చేసిన నంది విగ్రహాన్ని దొంగిలించారు.దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేస్తూ, ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు.
వెంకటప్ప అనే గ్రామస్థుడు మాట్లాడుతూ "గత 70 సంవత్సరాల నుండి మా గ్రామం నుండి ఒక్క దొంగతనం కేసు కూడా నమోదు కాలేదు." ఇప్పుడు దొంగతనం జరిగింది. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, "ప్రభుత్వం వెంటనే మేల్కొని నంది విగ్రహాన్ని కనిపెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గత నెల ప్రారంభంలో తూర్పు గోదావరి జిల్లాలోని గోలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మరో నంది విగ్రహం దొంగిలించబడింది.
(The above story first appeared on LatestLY on Sep 17, 2021 03:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

