Andhra Pradesh Shocker: చంపిందెవరు.. తాళి కట్టిన తెల్లారే శవంగా కనిపించిన వరుడు, షాకయిన వధువు, ఇరువురి కుటుంబ సభ్యులు, నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, కనీసం భార్యతో మనసారా మాట్లాడక ముందే వరుడు అనుమానాస్పదంగా మృతి (groom’s death within 24 hours) చెందిన ఘటన, వధూవరుల కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Nandyal, June 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, కనీసం భార్యతో మనసారా మాట్లాడక ముందే వరుడు అనుమానాస్పదంగా మృతి (groom’s death within 24 hours) చెందిన ఘటన, వధూవరుల కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. నంద్యాల జిల్లాలోని వెలుగోడు మండలం బోయరేవుకు చెందిన శివకుమార్కు నిన్న రాత్రి వివాహం జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అర్ధరాత్రివరకు నృత్యాలు చేస్తూ సంబరాలు ( wedding in Nandyal) చేసుకున్నాడు.
ఇంతలోనే మరుసటి రోజు ఉదయమే గ్రామశివారులో గాయాలతో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అతడిని నంద్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏదేని వాహనం ఢీకొట్టి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అసలు ఏం జరిగిందో (Tragedy in Nandyal) తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శివకుమార్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తొలుత ఈ మృతిని ప్రమాదంగా భావించగా, శివకుమార్ తండ్రి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారని, పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని వెలుగోడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జగన్ మోహన్ ఆదివారం తెలిపారు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు శివకుమార్ను బోయరేవుల నుంచి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా, ఆయన తుదిశ్వాస విడిచి హిట్ అండ్ రన్ కేసుగా కనిపించారు. అతని తండ్రి ఫిర్యాదుతో అతడికి సంబంధించిన వ్యక్తులందరినీ విచారిస్తున్నామని, దర్యాప్తు జరుగుతున్నందున ప్రస్తుతం మృతిపై ఏమీ చెప్పలేమని ఎస్ఐ తెలిపారు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన కొద్ది గంటల్లోనే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన విషాదంగా మారింది. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం పెద్ద కొల్లివసన ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన పవన్ కుమార్ ఓ యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి జూన్ 17వ తేదీన సింహాచలంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం పవన్ కుమార్ బైక్ పై తన మేనమామ బలగ సోమేశ్వరరావు తో కలిసి స్వగ్రామానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో పవన్ కుమార్ అక్కడికక్కడే మరణించగా, మేనమామ సోమేశ్వర రావు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 28, 2022 07:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

