Groom Tests Positive: రేపు పెళ్లి..వరుడికి కరోనా పాజిటివ్, తూర్పుగోదావరి జిల్లా పెళ్లింట్లో కరోనా అలజడి, రెండు కుటుంబాలను భయపెడుతున్న కోవిడ్-19
Image used for representation purpose only | Photo: Wikimedia Commons

Amaravati,July 24: తూర్పుగోదావరి జిల్లాలోని (East Godavari district) కొత్తపేటలోని ఓ కుటుంబం పెళ్లింట్లో కరోనా కలకలం సృష్టించింది. ఇరవై నాలుగు గంటల్లో వివాహం (Andhra couple's weddin) జరగనున్న పెళ్లింట్లో పెళ్లి కుమారుడికి కరోనా పాజటివ్‌ (Groom Tests Positive) అని నిర్ధారణ కావడంతో పెళ్లి వాయిదా పడింది. వివరాల్లోకెళితే.. కొత్తపేట గ్రామానికి చెందిన యువకుడికి ఇదే మండల పరిధిలోని బిళ్లకుర్రుకు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఈ నెల 24న వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. క‌డుపు నొప్పితో ఆస్ప‌త్రికి వెళితే ఆమె "అత‌డు" అయింది, 30 ఏళ్ల మహిళకు షాకింగ్ నిజాన్ని చెప్పిన డాక్టర్లు, ఆమె సోదరికి కూడా ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్దారణ

ఇరు కుటుంబాలు పెళ్లి శుభలేఖలు బంధువులకు పంచిపెట్టుకున్నారు. పెళ్లికి అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుండగా.. పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెండ్లి కుమారుడు ఈ నెల 18న స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో కోవిడ్‌ టెస్ట్‌ల క్యాంపు నిర్వహించగా శ్వాబ్‌ టెస్ట్‌ శాంపిల్‌ ఇచ్చాడు. అదే రోజు టెస్ట్‌ రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. యాచకురాలితో స్నేహం పెళ్లిగా మారింది, ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్ సమయంలో ఒక్కటైన జంట, ఆశీర్వదించిన రెండు కుటుంబాలు

దాంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో వారందరూ ఉలిక్కిపడ్డారు. నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలా? లేక పాజిటివ్‌ రిపోర్టు ఆధారం చేసుకుని పెళ్లి వాయిదా వేయాలా? అనే సందిగ్దావస్థలో బంధువులు కొట్టుమిట్టాడుతున్నారు. మరోసారి టెస్ట్‌ చేయించుకుని దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు వరుడిని అమలాపురం తీసుకువెళ్లి శాంపిల్స్‌ ఇచ్చినా అక్కడ రిపోర్టు రావడానికి జాప్యం అవుతుందని వైద్యులు చెప్పడంతో పెళ్లి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.