
కర్నూలు(Kurnool) జిల్లాహొళగుంద మండలం దేవరగట్టు(devaragattu) మాళ మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవంలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. బన్నీ ఉత్సవాల ప్రారంభంలోనే రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. దాదాపు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది.
దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు కర్రలతో పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు కర్రలతో దాడులు చేసుకోగా.. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. దేవరగట్టులో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
దేవరగట్టులో బన్ని ఉత్సవం ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా దేవతామూర్తులను కాపాడేందుకు మూడు గ్రామాల భక్తులు ఒకవైపు, ఏడు గ్రామాల భక్తులు మరోవైపు నిలబడి కర్రలతో కొట్టుకుంటారు.
2 Killed, 100 Injured in Traditional Stick Fight During Dussehra Celebrations in Kurnool
sensitive content
ఏపీలో భక్తి ఉత్సవం పేరిట రక్తపాతం
సంప్రదాయం పేరిట కర్రలతో దాడి
ముగ్గురు మృతి.. 100 మందికి పైగా గాయాలు
కర్నూలు జిల్లా దేవరగట్టులోని బన్నీ ఉత్సవంలో కర్రల సమరంలో సంప్రదాయం పేరిట దాడి చేసుకున్న ఇరువర్గాలు https://t.co/EYcYAdkzmX pic.twitter.com/bKourBQ30u
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2025
Devaragattu Bunny Festival in Kurnool- Traditional stick fight turns tragic as 2 dead, 100+ injured despite officials’ awareness drives. Foreign tourists witnessed the ritual, calling it a glimpse of India’s tradition.#Dussehra2025 #AndhraPradesh pic.twitter.com/emzYLgM57M
— Ashish (@KP_Aashish) October 3, 2025
ఈ కర్రల సమరాన్ని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. బన్నీ ఉత్సవం సందర్భంగా దేవతామూర్తులను కాపాడటానికి భక్తులు కర్రలతో కొట్టుకోవడం అక్కడ సాంప్రదాయంగా వస్తోంది.