Electric Shock in AP: విద్యుత్ షాక్ తో నలుగురి మృతి.. ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఘటన.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.
Vijayawada, Nov 4: ఏపీలోని (AP) తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. విద్యుత్ షాక్ తో (Electric Shock) నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో నలుగురు యువకులు కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజు షాక్ తగిలి మృతిచెందగా.. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం అలా..
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్లు తగులడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
(The above story first appeared on LatestLY on Nov 04, 2024 08:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

