National Highway Projects in AP: ఏపీలో రూ.5 లక్షల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి, రూ.3,000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులకు (National Highway Projects in AP) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం శంకుస్థాపన చేశారు.

National Highway Projects in AP: ఏపీలో రూ.5 లక్షల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి, రూ.3,000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
Nitin Gadkari (Photo-Twitter)

Kakinada, Sep 23: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులకు (National Highway Projects in AP) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం శంకుస్థాపన చేశారు. రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో రూ.3,000 కోట్లతో 129 కిలోమీటర్ల 3 రహదారులు, 5 ప్లై ఓవర్ల పనులకు గురువారం వర్చువల్‌ విధానంలో ఆయన శంకుస్థాపన (Nitin Gadkari lays foundation stones) చేశారు.ఈ జాతీయ రహదారి ప్రాజెక్టులు పూర్తయితే, కాకినాడ సెజ్, సెజ్ పోర్టు, ఫిషింగ్ హార్బర్ మరియు కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌లకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ కనెక్టివిటీ లభిస్తుంది. ఇది కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యం, సముద్రపు ఆహారం, ఆయిల్ మీల్స్, ఇనుప ఖనిజం, జీవ ఇంధనం మరియు గ్రానైట్ వంటి వాటి ఎగుమతి ఎటువంటి అవాంతరాలు లేకుండా చేయగలుగుతుంది.

ఈ ప్రాజెక్టుల్లో (Rs 3K cr national highway projects in Andhra Pradesh)ఐదు ఫ్లై ఓవర్ల నిర్మాణం కూడా ఉందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి తెలిపారు. ఇది నామవరం, శాటిలైట్ సిటీ, మండపేట, రామచంద్రపురం, కాకినాడ, ఉండరాజవరం, నిడదవోలు, తణుకు టౌన్ మరియు కైకరం వంటి ప్రాంతాలకు సాఫీగా మరియు సురక్షితమైన ట్రాఫిక్‌ను అందిస్తుంది. బ్లాక్‌స్పాట్‌లను సరిదిద్దడానికి ప్రత్యేక భద్రతా ఫీచర్లు నిర్ధారిస్తాయి. మిగిలిన మూడు ప్రాజెక్టుల్లో వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్‌లను నాలుగు లైన్లుగా తీర్చిదిద్దడంతోపాటు రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకు పక్కా ప్లానింగ్ తో కూడిన రెండు లైన్ల నిర్మాణం కూడా ఉన్నాయి.

ఏపీలో ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వినూత్న స్వాగతం పలికిన కడియపులంక నర్సరీ

ఆంధ్రప్రదేశ్‌లో రూ.5 లక్షల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 2024 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో రహదారులకు ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు మంజూరు చేశామని, లక్ష కోట్ల రూపాయల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. నౌకాయానంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమైన రాష్ట్రమన్నారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, సముద్ర ఉత్పత్తులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు.

రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గోదావరి జిల్లాల ఎంపీల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 27 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. వీటిలో భాగంగా విశాఖపట్నం పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మించనున్నట్లు చెప్పారు. రూ. 215 కోట్లతో మోరంపూడి, జొన్నాడ, కైకారం, ఉండ్రాజవరం, తేతలి ఫ్లై ఓవర్లకు అనుమతిచ్చామన్నారు.

గుంటూరు – బాపట్ల, బెంగళూరు – విజయవాడ, వినుకొండ – గుంటూరు, వేమగిరి – సామర్లకోట కెనాల్‌ రోడ్డు, రాజమండ్రి – కాకినాడ, హైదరాబాద్‌ నుంచి నాగార్జున సాగర్, మాచర్ల, అమరావతి మీదుగా విజయవాడ ఇబ్రహీంపట్నం వరకు రోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు – విజయవాడ, బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే, రాయ్‌పూర్‌ – విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్‌ – ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

భువనేశ్వర్‌ నుంచి భోగాపురం వరకు 6 వరుసల హైవే నిర్మించనున్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు మంజూరు చేస్తామన్నారు. వీటి ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్, విశాఖ నుంచి కాకినాడ సెజ్‌ పోర్ట్, ఫిషింగ్‌ హార్బర్, కాకినాడ యాంకరేజ్‌ పోర్టులకు గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్‌ కనెక్టివిటీ వస్తుందని చెప్పారు. దీనివల్ల బియ్యం, సీ ఫుడ్, ఆయిల్, ఐరన్‌ ఎగుమతులు ఎక్కువ జరుగుతాయన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఖనిజం, జీవ ఇంధనం, గ్రానైట్‌ రవాణా సులభమవుతుందని అన్నారు.

(The above story first appeared on LatestLY on Sep 23, 2022 10:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).