Gitam University: గీతం యూనివర్సిటీ క్యాంపస్ వద్ద ఉద్రిక్త వాతావరణం.. కిలోమీటర్ మేర కంచె వేసిన అధికారులు
విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచే యూనివర్సిటీకి నలువైపులా పోలీసుల మోహరింపు భారీగా జరిగింది. వర్సిటీకి వెళ్లే మార్గంలో బారికేడ్లను అడ్డుగా ఉంచారు.
Vizag, April 14: విశాఖపట్నంలోని (Vizag) గీతం యూనివర్సిటీ (Gitam University) వద్ద మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచే యూనివర్సిటీకి (University) నలువైపులా పోలీసుల (Police) మోహరింపు భారీగా జరిగింది. వర్సిటీకి వెళ్లే మార్గంలో బారికేడ్లను అడ్డుగా ఉంచారు. అటువైపు ఎవ్వరిని రానివ్వకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో గీతం యూనివర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. గీతం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్లో ప్రభుత్వం స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. మెుత్తం కిలోమీటర్ పొడవునా ప్రభుత్వ యంత్రాంగం కంచె వేసింది.
విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది. యంత్రాలు, కంచె సామగ్రితో రంగంలోకి. #Visakhapatnam #Vizag #Visakhapatnam #GitamUniversity pic.twitter.com/tfFrmLpL9e
— Vizag News Man (@VizagNewsman) April 14, 2023
స్థలమంతా ప్రభుత్వానిదే!
కంచె వేస్తున్న స్థలమంతా ప్రభుత్వానిదేనని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో గీతం కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు అప్పట్లో భీమిలి ఆర్డీవో భాస్కర్రెడ్డి వివరించారు. రుషికొండ గ్రామ సర్వే నెం.37, 38లోని స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్డీవో వివరించారు.
(The above story first appeared on LatestLY on Apr 14, 2023 10:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

