YSRCP Manifesto Today: వైసీపీ మేనిఫెస్టో నేడే విడుదల.. ఆవిష్కరించనున్న సీఎం జగన్.. పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం.. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల పెంపునకు ఛాన్స్.. ఈసారి మరో 2 కొత్త పథకాలు ఉండే అవకాశం
Cm Jagan (Photo-Video Grab)

Vijayawada, Apr 27: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ (YSRCP) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈక్రమంలో నేడు వైసీపీ మేనిఫెస్టో (YCP Manifesto) విడుదల కాబోతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో ఉండబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ ఐదేళ్లలో ప్రజలను ఆకట్టుకున్న అన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు.

Best Stews in The World: కీమా, కుర్మా, దాల్‌ తడ్కా.. ‘టేస్ట్‌ అట్లాస్‌’ బెస్ట్‌ స్టివ్స్‌ జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలు..

PBKS Vs KKR: భారీ స్కోర్ ను ఛేదించిన పంజాబ్, చేజింగ్ లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించిన పంజాబ్ కింగ్స్, సెంచ‌రీతో అద‌రగొట్టిన‌ జానీ బెయిర్‌స్టో

ఉద్యోగాలకు ప్రాధాన్యత

పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పనపై కూడా మేనిఫెస్టోలో ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు పథకాలకు మరిన్ని నిధులు పెంచనున్నట్టు సమాచారం. ఈసారి మరో 2 కొత్త పథకాలు ప్రారంభించే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.