Cough Syrup Deaths: దగ్గు మందుతో పెరుగుతున్న మరణాలు, మరో రెండు దగ్గు మందులను బ్యాన్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం, లిస్టులో ఏ సిరప్స్ ఉన్నాయంటే..

తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ విభాగం (DCA) ద్వారా కొన్ని దగ్గు సిరపులపై నిషేధాలు విధించారు. ఈ నిర్ణయం ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని చిన్నారుల దగ్గు మందుల వల్ల గల్లంతైన ఘటనల నేపథ్యంలో తీసుకుంది ప్రభుత్వం.

Cough Syrup Deaths: దగ్గు మందుతో పెరుగుతున్న మరణాలు, మరో రెండు దగ్గు మందులను బ్యాన్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం, లిస్టులో ఏ సిరప్స్ ఉన్నాయంటే..
Cough Syrup | Representative Image (Photo Credits: Pixabay)

తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ విభాగం (DCA) ద్వారా కొన్ని దగ్గు సిరపులపై నిషేధాలు విధించారు. ఈ నిర్ణయం ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని చిన్నారుల దగ్గు మందుల వల్ల గల్లంతైన ఘటనల నేపథ్యంలో తీసుకుంది ప్రభుత్వం.  ఈ ఘటనల్లో కోల్డ్‌ రిఫ్‌ అనే సిరప్ వాడిన పిల్లల్లో మృతుల సంఖ్య నమోదయ్యింది. ఈ ఘటనలపై కేంద్రం, సంబంధిత రాష్ట్రాలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి, రాష్ట్రంలో పిల్లలకు ప్రమాదకరంగా మారే సిరపుల వాణిజ్యాన్ని వెంటనే నిలిపివేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రకాల సిరప్‌లపై నిషేధం ఉంది. ముందుగా కోల్డ్‌ రిఫ్‌ సిరప్‌ను పూర్తిగా నిషేధించింది. తర్వాత రీలైఫ్‌ (Relief), రెస్పీ ఫ్రెస్‌-TR (Respi Refresh-TR) అనే రెండు సిరప్‌లలో కల్తీ జరిగినట్లు గుర్తించిన తర్వాత.. వాటి విక్రయాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సిరప్‌లను గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీలు తయారు చేశాయి. కల్తీ కారణంగా, వీటిని వాడిన పిల్లలకు ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆరోగ్యవేత్తలు హెచ్చరించారు.

జామ ఆకులతో మీ ఆరోగ్యం ఎంతో సురక్షింతగా ఉంటుంది.. దగ్గు, జలుబు, శ్లేష్మం, శ్వాసకోశ, ఊపిరితిత్తులు, ఇమ్యూనిటీకి అన్నింటిని మీ శరీరం నుండి తరిమేస్తుంది..

ప్రజారోగ్య విభాగం ఈ విషయంపై ప్రజలకు అనేక సూచనలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా చిన్నారుల్లో సాధారణంగా వచ్చే దగ్గు, జలుబును క్రమానుగుణంగా తగిన నివారణ చర్యల ద్వారా కట్టడి చేయవచ్చని తెలిపింది. ఎడాపెడా దగ్గు మందులు వాడితే, అది చిన్నారుల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉంది. అందువల్ల రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందులు ఇవ్వకూడదని, ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దగ్గు మందులు వాడాలని ప్రజలకు సూచనలు ఇచ్చింది.

ఈ చర్య ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడే లక్ష్యంతో ముందడుగు వేసింది. ప్రజలందరికి, ముఖ్యంగా తల్లిదండ్రులు, చిన్నారుల దగ్గు, జలుబు సమస్యలను డాక్టర్ సలహా లేకుండా మందులతో నివారించవద్దని స్పష్టంగా సూచనలిచ్చింది.

(The above story first appeared on LatestLY on Oct 08, 2025 05:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).