SLBC Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ.. డ్రోన్ ఫుటేజీ బయటకు (వీడియో)
తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలటంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
Hyderabad, Feb 23: తెలంగాణలోని (Telangana) నాగర్ కర్నూల్ లోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలటంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి జరుగుతున్న సహాయక చర్యలలో భారత సైన్యం చేరింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో భారత సైన్యం కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఇక సొరంగం వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.
SLBC టన్నెల్ డ్రోన్ విజువల్స్ pic.twitter.com/kPekK2xypY
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025
సొరంగంలో చిక్కుకున్న వారు వీరే
శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సొరంగంలో చిక్కుకున్న వారు వీరే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, జార్ఖండ్ కు చెందిన సంతోష్ సాహు, అనూజ్ సాహు, సందీప్ సాహూ, జక్తా ఎక్సెస్, జమ్మూకాశ్మీర్ కు చెందిన సన్నీసింగ్, పంజాబ్ కు చెందిన సన్నీసింగ్ ఉన్నట్లుగా తెలిపారు.
(The above story first appeared on LatestLY on Feb 23, 2025 10:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

