Hyderabad, January 14: ఈ శనివారం రాష్ట్రంలో కరోనా నివారణ వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ యొక్క తొలి డోసును ఆరోగ్యశాఖ సిబ్బందికి కాకుండా, గాంధీ ఆసుపత్రిలో పనిచేసే శానిటైజేషన్ వర్కర్లకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే టీకా పంపిణీలో ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా ఇవ్వాలని, ఒక కేంద్రంలో కేవలం 30 మందికి మాత్రమే టీకా అందించాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇక భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ డోసును తొలి రోజు ఎవరికీ ఇవ్వబడదని అధికారులు సూచించారు.
రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 28,894 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 276 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 588 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 73,79,538 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 290,916కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిiral/hyderabad-fed-up-with-wifes-harassment-man-attempts-to-end-his-life-police-rescued-viral-video-133577.html" title="Hyderabad Viral: నా భార్య నన్ను ఇయ్యరబయ్యర కొడ్తంది.. వెంటనే విడాకులు ఇప్పించండి.. లేకపోతే, చెర్ల దుంకి సచ్చిపోతా.. కొంపల్లిలో ఆందోళనకు దిగిన భర్త (వీడియో వైరల్)">Hyderabad Viral: నా భార్య నన్ను ఇయ్యరబయ్యర కొడ్తంది.. వెంటనే విడాకులు ఇప్పించండి.. లేకపోతే, చెర్ల దుంకి సచ్చిపోతా.. కొంపల్లిలో ఆందోళనకు దిగిన భర్త (వీడియో వైరల్)