Raghubar Das: హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తాం, బీజేపీని అధికారంలోకి తీసుకురండి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సంచలన వ్యాఖ్యలు
Former Jharkhand Chief Minister and Bharatiya Janata Party leader Raghubar Das. (ANI/file photo)

Hyd, Julu 1: తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ (Raghubar Das) శుక్రవారం అన్నారు.

హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా (Hyderabad's Name Will Be Changed to Bhagyanagar) అని అడిగినప్పుడు, “ఖచ్చితంగా. గత రెండు రోజులుగా నేను చూస్తున్న తీరు వ్యాపారస్తులైనా, సాధారణ ప్రజలైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వంశపారంపర్య రాజకీయాలను నమ్ముకుని కుటుంబం గురించే ఆలోచిస్తుంది. తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. రాజవంశ రాజకీయాలకు ముగింపు పలికేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించనున్నార అని తెలిపారు.

తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ, హైదరాబాద్‌కు ఏ ముఖం పెట్టుకుని వస్తారు, బీజేపీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, మండిపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

రఘుబర్ దాస్ శుక్రవారం హైదరాబాద్‌లోని చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన శిరచ్ఛేదం ఘటనపై ఆయన మాట్లాడుతూ, “పేద టైలర్ కుటుంబం నుండి వచ్చిన కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేశారని, వారి (హంతకులు) ISIS మరియు పాకిస్తాన్‌తో సంబంధం కలిగి ఉన్నారని అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని హోంమంత్రి అమిత్ షా కోరారు. భాజపా ఎప్పుడూ సోదరభావాన్ని నమ్ముతుంది.

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే, ఈ నెల 3న రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస, పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ

రాజకీయ ఓటు బ్యాంకు కోసం అశోక్ గెహ్లాట్ హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. జార్ఖండ్ ప్రజలు మరియు ముస్లిం సమాజం ఒవైసీని తిరస్కరించారు. జార్ఖండ్‌లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రధాని మోదీ పాలనలో ప్రజలను విభజించేందుకు ప్రయత్నించే శక్తులకు భారత రాజకీయాల్లో స్థానం లేదు’ అని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రసంగించనున్నారు.