TS's Corona Update: తెలంగాణలో కొత్త మరో 309 కరోనా కేసులు నమోదు, రాష్ట్రాలకు ప్రారంభమైన కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా, ప్రాధాన్యత క్రమంలో టీకా అందజేయడంలో మార్గదర్శకాలు జారీ

ఇక కొవిడ్ నివారణ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో వ్యాక్సిన్ సరఫరా కూడా ప్రారంభమైంది. పుణెలోని సీరమ్ ఇనిస్టిస్ట్యూట్ నుంచి ప్రత్యేక ట్రక్కుల్లో సుమారు 6 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తెలంగాణకు బయలుదేరాయి....

TS's Corona Update: తెలంగాణలో కొత్త మరో 309 కరోనా కేసులు నమోదు, రాష్ట్రాలకు ప్రారంభమైన కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా, ప్రాధాన్యత క్రమంలో టీకా అందజేయడంలో మార్గదర్శకాలు జారీ
Coronavirus Outbreak (Photo Credits: IANS)

Hyderabad, January 12: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టీకా ఏర్పాట్లను సీఎం కేసీఆర్ సమీక్షించారు, టీకా అందించిన తర్వాత ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం సూచించారు. తొలివిడత కోవిడ్ టీకా పంపిణీ ఈనెల 16న నిర్వహించబడుతుంది. మొట్టమొదటగా వైద్య, ఆరోగ్య సిబ్బంది, ASHA కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది టీకా అందుకోనున్నారు. వీరి తర్వాత పోలీసులు, భద్రతా సిబ్బంది, శానిటరీ కార్మికులు మరియు ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులకు, ఆ తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి మరియు అనారోగ్య కారణాలు ఉన్నవారికి టీకా ఇవ్వబడుతుంది.

టీకా పంపిణీ సమయంలో ప్రజలను ప్రాధాన్యత ప్రాతిపదికన చేర్చే బాధ్యతను గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని, అలాగే పోలీసులకు మరియు ఇతర భద్రతా సిబ్బందికి వ్యాక్సిన్ తీసుకునే బాధ్యతను పోలీస్ స్టేషన్ హౌస్ అధికారులు, సబ్ ఇన్స్పెక్టర్లు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే,  నిన్న రాత్రి 8 గంటల వరకు 34,431  మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 301 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 675 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 73,12,452 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 290,309కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  58 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయి.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,568కు పెరిగింది. అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 293 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో284,317 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,524 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇక కొవిడ్ నివారణ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో వ్యాక్సిన్ సరఫరా కూడా ప్రారంభమైంది. పుణెలోని సీరమ్ ఇనిస్టిస్ట్యూట్ నుంచి ప్రత్యేక ట్రక్కుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను విమానాశ్రయాలకు చేరవేస్తున్నారు. అవి కార్గో విమానాల ద్వారా ఆయా రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు. తెలంగాణకు సుమారు 6 లక్షలకు పైగా డోసులు రానున్నట్లు సమాచారం.

(The above story first appeared on LatestLY on Jan 12, 2021 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).