
Hyderabad, December 10: తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఎ పరిధులతో పాటు వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్ధారించిన పరీక్షల మేరకు 51,402 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 643 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 684 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 59,19,635 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 275,904కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 109 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 84, రంగారెడ్డి నుంచి 82, వరంగల్ అర్బన్ నుంచి 56 మరియు కరీంనగర్ నుంచి 38 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1482కు పెరిగింది.
అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 805 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 266,925మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,497 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.