TSRTC: ఎఫ్-24 టికెట్ ఒకరు కొంటే 4గురు వ్య‌క్తులు రోజంతా హైదరాబాద్ మొత్తం చుట్టేయవచ్చు, సంచలన ఆఫర్లను ప్రకటించిన టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ స‌జ్జ‌నార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్టీసీ ప్రగతిపథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మరో రెండు కొత్త పథకాలను (budget-friendly ticketing offers) ప్రవేశపెట్టారు.

TSRTC: ఎఫ్-24 టికెట్ ఒకరు కొంటే 4గురు వ్య‌క్తులు రోజంతా హైదరాబాద్ మొత్తం చుట్టేయవచ్చు, సంచలన ఆఫర్లను ప్రకటించిన టీఎస్ఆర్టీసీ
TSRTC MD VC Sajjanar (Photo-Twitter)

టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ స‌జ్జ‌నార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్టీసీ ప్రగతిపథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మరో రెండు కొత్త పథకాలను (budget-friendly ticketing offers) ప్రవేశపెట్టారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్ర‌యాణించే వారి కోసం ఆర్టీసీ ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. టీ-6, ఎఫ్-24 టికెట్ల పేరిట సరికొత్త ఆఫ‌ర్ల‌ను ప్యాసింజర్లకు కోసం తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఆవిష్క‌రించారు. టీ-6 ఆఫర్‌ ఏంటంటే.. మ‌హిళ‌లు, సీనియ‌ర్ సిటిజ‌న్ల టీ-6ని ఉపయోగించుకోవచ్చు. వీళ్లు రూ. 50 చెల్లించి టీ-6 టికెట్ కొనుగోలు చేస్తే.. 6 గంట‌ల పాటు (అనగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) సిటీ ఆర్డినరీ బస్‌ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బ‌స్సుల్లో ప్ర‌యాణించవచ్చు.

మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు, ఏప్రిల్ 25 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు

ఇక ఎఫ్-24 ఆఫర్ విషయానికి వస్తే.. కుటుంబ స‌భ్యులు, లేదా స్నేహితుల కోసం ఈ టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది శనివారం, ఆదివారం, సెలవు దినాలలో వర్తిస్తుంది. రూ. 300 చెల్లించి ఈ టికెట్‌పై 4గురు వ్య‌క్తులు రోజంతా సిటీ ఆర్డినరీ బస్‌ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో ప్ర‌యాణించే వెసులుబాటు క‌ల్పించారు.

టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ ఇదిగో, మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష, మార్చి 6వ తేదీ నుంచి మే 6 వ‌ర‌కు దరఖాస్తుకు అవకాశం

గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని సజ్జనార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా.. వారిలో 55.50 లక్షల మంది T-24 టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు.

(The above story first appeared on LatestLY on Mar 09, 2023 08:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).