COVID in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 346 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో 5 వేలకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో నేడు డ్రైరన్

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఈరోజు ఆరోగ్య శాఖ అధికారులు డ్రైరన్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1200 కేంద్రాల్లో ఈ మాక్ డ్రిల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలివిడతలో ఫ్రంట్ లైన్ వారియర్లు టీకా అందుకోనున్నారు....

COVID in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 346 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో 5 వేలకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో  నేడు డ్రైరన్
Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, January 8:  తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఈరోజు ఆరోగ్య శాఖ అధికారులు డ్రైరన్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1200 కేంద్రాల్లో ఈ మాక్ డ్రిల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలివిడతలో ఫ్రంట్ లైన్ వారియర్లు టీకా అందుకోనున్నారు, త్వరలోనే  వ్యాక్సిన్ పంపిణీపై తేదీలు ఖరారు కానున్నాయి.

ఇక కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 38,985 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 346 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 699  మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 71,84,598 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,89,135కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 34, రంగారెడ్డి నుంచి 41 కేసులు వచ్చాయి, ఇక మిగతా అన్ని జిల్లాల నుంచి 20 లోపే కేసులు నమోదయ్యాయి. ఇతర వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana
మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,561కు పెరిగింది.
అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 397 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 282,574 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,000 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jan 08, 2021 10:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).