Hyderabad, July 22: తెలంగాణలో లక్షలాది మంది రైతులతో, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతర పరిశ్రమతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించేందుకు, మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మార్గదర్శనం చేయాలని, నాయకత్వం వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతుందని, దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని సీఎం అన్నారు. అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో రైతులు నూటికి నూరు శాతం చెప్పిన పంటలే వేశారని, ఏ గుంటలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నారో ఖచ్చితమైన వివరాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి భారతదేశంలో గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం జరిపి, రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్నాం. ఒక్క రూపాయి కూడా భూమి శిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తీరువా విధానాన్నే రద్దు చేయడంతో పాటు పాత బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసింది. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంటును ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని రైతుబంధు పథకం కింద ప్రతీ పంటకు తమ ఖాతాల్లోనే జమ చేస్తున్నది. ఏ కారణం చేత రైతు మరణించినా అతడి కుటుంబానికి 5 లక్షల రైతుబీమా అందిస్తున్నది.
కరోనా కష్ట కాలంలోనూ రైతులు పండించిన ప్రతీ పంటను నూటికి నూరుశాతం ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులను సంఘటిత పరిచేందుకు ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితులు ఏర్పాటు చేసింది. క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం కూడా మూడు నెలల్లో పూర్తి అవుతుంది. రైతు వేదికలు రైతుల చైతన్యానికి వేదికలుగా మారుతాయి. ముఖ్యమంత్రితో పాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుంది’’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
‘‘తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారాలి. అంతిమంగా రైతులు ధనిక రైతులుగా మారాలి. అందుకోసమే ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఎంతో వ్యయం చేస్తున్నది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలం కావాలి. సంప%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B1%81+%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81+%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AF%E0%B0%A8%E0%B0%82+%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%2C+%E0%B0%85%E0%B0%B5%E0%B0%B8%E0%B0%B0%E0%B0%82+%E0%B0%AE%E0%B1%87%E0%B0%B0%E0%B0%95%E0%B1%81+%E0%B0%8F%E0%B0%88%E0%B0%93%E0%B0%B2+%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AE%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81+%E0%B0%9A%E0%B1%87%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%3B+%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82%E0%B0%AA%E0%B1%88+%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82+%E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D+%E0%B0%B8%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7', 900, 500);" href="javascript:void(0);">