IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు
ఏపీ క్యాడర్ కు చెంది తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
Hyderabad, Feb 22: ఏపీ క్యాడర్ (AP Cadre) కు చెంది తెలంగాణలో (Telangana) పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు (IPS Officers) కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. శనివారం నాడే ఇది జరుగాలని పేర్కొంది. ఉత్తర్వులు అందుకొన్న వారిలో తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్ అంజనీకుమార్, కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి ఉన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)... రెండు రాష్ట్రాలకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కేటాయించింది.
డీజీ అంజనీ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ అదేశాలు
ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అంజనీ కుమార్
తెలంగాణ మాజీ డీజీపీ గా పని చేసిన అంజనీ కుమార్
అంజనీ కుమార్, అభిలాష బిస్త, అభిషేక్ మహంతిని వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశాలు pic.twitter.com/G1WBYK9nke
— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2025
క్యాట్ కు కొందరు
అయితే ఈ కేటాయింపులు సరిగ్గా లేవంటూ కొందరు అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు. దాంతో డీఓపీటీ హైకోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు ఖండేకర్ కమిటీని నియమించింది. పలువురు ఐపీఎస్ లను ఏపీకి పంపించాలంటూ సదరు కంపిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల మేరకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ లను ఏపీకి వెళ్లాలని హోంశాఖ ఆదేశించింది.
ఫ్రీగా చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, హైదరాబాద్ ఉప్పల్లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం
(The above story first appeared on LatestLY on Feb 22, 2025 08:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

