YS Sharmila: గజ్వేల్ పర్యటనకు వెళ్తున్న షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. హౌస్ అరెస్ట్.. పర్యటనకు అనుమతి లేదని వెల్లడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
సిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో పర్యటించేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సిధ్ధమయ్యారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
Siddipet, Aug 18: సిద్దిపేట (Siddipet) జిల్లాలోని సీఎం కేసీఆర్ (CM KCR) నియోజకవర్గం గజ్వేల్ లో (Gajwel) పర్యటించేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) సిధ్ధమయ్యారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదన్న కారణంతో ఆమెను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
BRS= Bandipotla Rashtra Samithi, says Sharmila pic.twitter.com/bGWt3sxLKf
— pala hanmi reddy (@hanmireddy) August 18, 2023
పర్యటనకు కారణమిదే
దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామస్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బాధితులకు మద్దతుగా నిలిచేందుకు గజ్వేల్ లో పర్యటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. దీంతో ఈరోజు పర్యటనకు సిద్ధమవ్వగా.. అనుమతిలేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 18, 2023 10:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

