Bus Accident In Bolivia: రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం

బొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Bus Accident In Bolivia: రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం
Road Accident In Bolivia (Credits: X)

Newdelhi, Mar 2: బొలీవియాలోని (Bolivia) పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్నాయి (Bus Accident). ఈ ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉయుని, కొల్చాని రహదారిపై ప్రయాణిస్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు లోయలోకి దూసుకెళ్లింది. మరో బస్సు తుక్కుతుక్కు అయ్యింది.

రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం

ప్రమాదానికి కారణం ఇదే..

అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)

 

(The above story first appeared on LatestLY on Mar 02, 2025 10:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).