Sirisha Bandla: అంతరిక్షంలోకి తెలుగు కీర్తి పతాకం, వీఎస్ఎస్‌ యూనిటీ వ్యోమనౌకలో నేడు అంతరిక్షంలోకి ప్రయాణించనున్న తెలుగమ్మాయి బండ్ల శిరీష, వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అధినేత సర్‌ రిచర్డ్‌ బ్రాన్‌సన్‌‌తో పాటు మరో నలుగురు అంతరిక్షంలోకి..
The Crew Members of Unity 22 (Photo Credits:Twitter/Virgin Galactic)

Houston, July 11: గగనపు ‌వీ‌ధిలో తెలుగు కీర్తి పతాకం మరి కొన్ని గంటల్లో రెప‌రె‌ప‌లా‌డ‌బో‌తు‌న్నది. ఏపీ‌లోని గుంటూరు జిల్లాకు చెందిన తెలుగమ్మాయి బండ్ల శిరీష(34) నేడు అంతరిక్షంలోకి (Indian-origin Shirisha Bandla) ప్రయాణించనుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన వీఎస్ఎస్‌ యూనిటీ వ్యోమనౌకలో ఆమె రోదసిలోకి దూసుకెళ్లనుంది. అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి ఈ ప్రయోగం ఉంటుందని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష (Sirisha Bandla) హ్యూస్టన్‌లో పెరిగారు.

అక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్‌ ఇంజనీర్‌గా (aeronautical engineer) పనిచేస్తున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాల్యం నుంచీ వ్యోమగామి కావాలనుకున్న శిరీష, ఎట్టకేలకు ఆదివారం తన కలను నెరవేర్చుకోనుండటం విశేషం. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్‌లో పేర్కొన్నారు.

Here's Sirisha Bandla Tweet

కల్పన చావ్లా, సునీత విలియమ్స్‌ తర్వాత రోదసిలోకి ప్రయాణించనున్న మూడవ భారతీయ మహిళగా శిరీష నిలవనున్నారు. ఈ ప్రయాణంలో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అధినేత సర్‌ రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ కూడా ఉండటం గమనార్హం. ఈ ప్రయోగం విజయం అనంతరం.. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలనేది వర్జిన్‌ సంస్థ (Virgin Galactic’s SpaceShip) యోచనగా తెలుస్తోంది.

అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ, జూలై 11న వ్యోమ నౌకను ప్రయోగించనున్న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు పోటీ

అంతరిక్ష పర్యా‌ట‌కాన్ని ప్రోత్సహించ‌డంలో భాగంగా ‘వ‌ర్జిన్‌ గెలా‌క్టిక్‌’ అంత‌రిక్ష పరి‌శో‌ధన సంస్థ ‘వీ‌ఎ‌స్‌‌ఎస్‌ యూని‌టీ-22’ అనే మాన‌వ‌స‌హిత వ్యోమ‌నౌకను రోదసీలోకి నేడు పంపి‌స్తోంది. వాతా‌వ‌రణ పరి‌స్థి‌తు‌లన్నీ అను‌కూ‌లిస్తే న్యూ మెక్సికో నుంచి ఆది‌వారం ఉదయం 9 గంట‌లకు (అ‌మె‌రికా కాల‌మానం) ‘వీ‌ఎ‌స్‌‌ఎస్‌ యూనిటీ–22’ అంత‌రి‌క్షం‌లోకి దూసు‌కు‌పో‌ను‌న్నది. వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాస్‌నన్‌ (Sir Richard Branson), శిరీషతోపాటు మరో నలుగురు హ్యోమగాములు ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌లో వెళ్లనున్నారు. భూమి నుంచి 15 వేల మీటర్ల ఎత్తుకు వీఎంఎస్‌ ఈవ్‌ ప్రత్యేక విమానం వెళ్లనుంది. అందులోనే వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22 ఉంటుంది.