COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షలకు చేరువైన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 10 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు
Medical staff at a hospital isolation ward | (Photo Credits: PTI)

Amaravati, August 6: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. గత 24 గంటల్లో  రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,96,789 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 1,93,894 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా,  తూర్పు గోదావరి జిల్లా నుంచి నుంచి అత్యధికంగా  1,351 కేసులు నమోదయ్యాయి. అలాగే కర్నూలు జిల్లా నుంచి 1285, మరియు అనంతపూర్ జిల్లా నుంచి 1112 పాజిటివ్ కేసుల చొప్పున నమోదయ్యాయి.

గడిచిన ఒక్కరోజులో మరో 72 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 1753 కు పెరిగింది. రాజధాని వికేంద్రీకరణ: విశాఖలో తొలి అడుగు పోలీస్ శాఖదేనా?  15 రోజుల్లో డీజీపీకి తుది నివేదిక

AP's COVID19 Report: 

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు 8,516 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 1,12,870 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 82,166 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.  అక్టోబర్ 15 నుంచి కాలేజీలు రీ-ఓపెన్, సీఎం రివ్యూ మీటింగ్ విశేషాలను వెల్లడించిన విద్యా శాఖ మంత్రి సురేష్

గడిచిన ఒక్కరోజులో భారీ స్థాయిలో 63,686 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు 22,99,332 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.