Kasibugga SI Sirisha: గుర్తు తెలియని మృతదేహాన్ని 2 కిలోమీటర్లు మోసిన మహిళా ఎస్సై, అంత్యక్రియలు కూడా జరిపించిన శ్రీకాకుళం కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష, ప్రశంసలు కురిపించిన తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలు
మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సైపై (Woman SI sirisha) తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడివికొత్తూరు గ్రామం పొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందింది.
Amaravati, Feb 1: మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సైపై (Woman SI sirisha) తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడివికొత్తూరు గ్రామం పొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందింది. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆమె.. (Kasibugga SI Sirisha) ఆ శవాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్థించారు.
ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో 2కిలో మీటర్ల వరకు మోసుకు వెళ్లారు.స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్కు మృతదేహాన్ని అప్పగించడమేగాక.. దాని నిర్వాహకులు చిన్ని కృష్ణతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీసులు.. మహిళా ఎస్సై మంచి మనస్సును అభినందిస్తున్నారు.
కాగా కాశీబుగ్గ ఎస్సై శిరీష పొలం గట్లు, అటవీప్రాంతాలు దాటుకుంటూ ఓ స్ట్రెచర్ పై మోసుకురావడం పట్ల (kasibugga SI Carry Unidentified Corpse) సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది.
ఏపీ పోలీస్ విభాగం, తెలంగాణ పోలీస్ విభాగం కూడా ఎస్సై శిరీషను అభినందిస్తూ ట్వీట్ చేసింది. ఆమె వీడియోను కూడా పంచుకుంది. కాశీబుగ్గ ఎస్సై శిరీష మానవీయ దృక్పథాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు.
Here's AP Police Tweet
AP Police cares: DGP Gautam Sawang lauds the humanitarian gesture of a Woman SI, K.Sirisha of Kasibugga PS, @POLICESRIKAKULM as she carried the unknown dead body for 2 km from Adavi Kothur on her shoulders & helped in performing his last rites.#WomanPolice #HumaneGesture pic.twitter.com/QPVRijz97Z
— Andhra Pradesh Police (@APPOLICE100) February 1, 2021
Here's TS Police Tweet
సెల్యూట్ మేడమ్!
ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని లేదా ఇలాంటి పనులే చేయాలి అనే సమాజంలో...
ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫారనికి, చేస్తున్న సేవకి సగర్వంగా చేస్తున్నాం -సెల్యూట్. https://t.co/fNsAxoXQSA
— Telangana State Police (@TelanganaCOPs) February 1, 2021
ఏపీలోని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై కొత్త శిరీషను తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సేవలను కొనియాడుతూ సెల్యూట్ మేడమ్ అంటూ ట్వీట్ చేశారు. ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని, ఇలాంటి పనులే చేయాలనే సమాజంలో... ఆమె ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫారానికి, చేస్తున్న సేవకి సగర్వంగా సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల ట్వీట్పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రాష్ట్రాలుగా వేరైనా.. పోలీస్ అనే వృత్తి రెండు రాష్ట్రాల పోలీసులను ఒక్కటి చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 01, 2021 04:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

