Weather Forecast: వాయుగుండగా మారనున్న బలపడిన అల్పపీడనం, దీని ప్రభావం ఏపీపై అంతగా ఉండదని తెలిపిన వాతావరణ శాఖ, రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు
Low pressure (Photo Credits: PTI)

Vjy, Dec 22: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం (low pressure) బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా (Chance of turning into a cyclone) బలపడనుంది. అనంతరం ఆ వాయు­గుండం పశ్చి­మ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమ­రిన్‌ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావర­ణ విభాగం (ఐఎండీ) బుధవా­రం తెలిపింది. దీని ప్రభావం ఏపీ రాష్ట్రంపై నామమాత్రంగానే ఉండనుంది.

ఈ లక్షణాలు ఉంటే ఒమిక్రాన్ బిఎఫ్.7 బారీన పడినట్లే, నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం

మరో­­వైపు రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నే­య గాలులు వీస్తున్నా­యి. వీటి ఫలితంగా రాష్ట్రంలో (Andhra Pradesh) పొగమంచు కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్షీణిస్తుండడంతో చలి ప్రభా­వం అధికంగా ఉంటోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద­యం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రం­లో పొడి వాతావరణ నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది.

కరోనాపై మరోసారి యుద్ధానికి సిద్ధం, రంగంలోకి ప్రధాని మోదీ, అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్న ప్రధాని, ప్రికాషన్ డోసు సహా కరోనా కట్టడి చర్యలపై సూచనలు చేసే అవకాశం

ఈ నెల 24 నుంచి ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉం­ద­ని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వా­తావరణం ఉంటుందని తెలిపింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి.