I am Hazarath, Telugu Lead on LatestLY Telugu. I have been part of the journalism and digital industry for 10 years, with previous work experience for One India and 99tv and Surya and ATV. Writing my Hobby and Reporting my passion.
బీజెపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దాయాది దేశం పాకిస్థాన్కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం ఇండియా రావడానికి వీసా వచ్చేలా సహాయం చేశారు.
మొబైల్ పోర్టబిలిటీ.. మన మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోకుండా మరో ఆపరేటర్కు మార్చుకునే సదుపాయం ఇది. ఈ సర్వీసుకు కొద్ది రోజులు బ్రేకులు పడనున్నాయి. నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) సేవలను నిలిపివేస్తున్నట్లు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది.
జమ్ము కాశ్మీర్లో పరిస్థితి మెరుగుపడే వరకూ ఎవరూ ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టడానికి వీలు లేదని డిజిపి దిల్బాగ్ సింగ్ అన్నారు. కాశ్మీర్లోయలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి, పరిస్థితులు మెరుగుపడే వరకూ ఏ రకమైన పద్ధతుల్లోనూ ప్రదర్శనలు చేపట్టరాదని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)ను అలాగే ప్రధానమంత్రి సురక్షా యోజన (పీఎంఎస్బీవై)Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)ల పేరుతో ఇన్సూరెన్స్ స్కీమ్స్ను అందిస్తోంది. వీటి కాలపరిమితిని ఏడాదిగా నిర్ణయించింది.
ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు శుభవార్తను మోసుకొచ్చింది. రైలు ప్రయాణాలు ఎక్కువ చేసే వారికోసం ఇన్నోవేటివ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పండుగ సంధర్భంగా ఎక్కువ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులకు సుఖవంతమైన జర్నీని అందించడంలొ భాగంగా ఇకపై ఎక్కువ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సరదాగా బ్యాట్ పట్టారు. హర్యానాలోని రేవారిలో విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వార్ మరింతగా వేడెక్కుతోంది. బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటల యుధ్దం నడుస్తోంది. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై ప్రధాని మోడీ ఘాటుగా స్పందించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు అన్ని రాజకీయ పార్టీల వైపు నుంచి మద్దతు లభిస్తోంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్కు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించగా, ఉద్యోగ సంఘాలు సైతం సంఘీభావం తెలిపాయి.
అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా వీరంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే వారంతా బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు.
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం చాకిరాల వద్ద వేగంగా వచ్చిన ఎ కారు అదుపుతప్పి నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది.
పరిపాలనలో తనదైన ముద్రతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆరు సూత్రాలు నిర్ణయించారు. ఈ ఫార్ములాతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బోటు చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతోంది.
దేశంలో మళ్లీ ఉగ్ర అలజడి మొదలైంది. మినీ సార్వత్రిక సమరం సమీపిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు తమ పంజాను విసిరేందుకు కాచుకూర్చున్నారని అనధికార రిపోర్టులు వస్తున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి ఉగ్రవాదుల కదలికలు ఎక్కువైనట్లుగా తెలుస్తోంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల మూడు, నాలుగు రోజుల్లో కర్ణాటక సముద్ర తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ బులిటిన్ విడుదల చేసింది.
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇండియాకు షాకిచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన కొత్త సీరీస్ ఫోన్లు పిక్సల్ 4, పిక్సల్ 4ఎక్స్ఎల్ ఫోన్లను ఇండియాలో విడుదల చేయడం లేదని తెలిపింది. ఈ ఫోన్లు గత వారం న్యూయార్క్ లో విడుదలైన సంగతి తెలిసిందే.
కాలం రయ్యిమంటూ పరిగెడుతోంది. కాలంతో పాటే మనం కూడా అంతే వేగంతో పరిగెడుతున్నాం. ఈ నేపథ్యంలో నిద్ర అనేది ప్రధాన సమస్యగా మారింది. టైంకి తిని సమయానికి నిద్రపోవడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైపోతోంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు కూడా నిద్రపోలేని పరిస్థితి.
పరిపాలనలో ఏపీ సీఎం వైయస్ జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ తాజాగా పేదల కోసం మరో సంచలన కార్యక్రమాన్ని చేపట్టారు.
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకం తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ నవోదయం పథకాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణాలో 13 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అందరూ ప్రత్యామ్నాయ మార్గాలతో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వర్గం కూడా సమ్మెకు సిద్ధమైంది. ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది.