CM YS Jagan to Meet PM Modi: మరికొద్ది సేపట్లో ప్రధానితో వైయస్ జగన్ భేటీ, రాష్ట్రంలో జరిగిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, తదనంతరం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం
PM Narendra Modi Phone Call to Ap CM YS Jagan (Photo-PTI)

Amaravati, Oct 6: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు న్యూ డిల్లీలో సమావేశం (CM YS Jagan to Meet PM Modi కానున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 5 సాయంత్రం 6 గంటలకు ఆయన (YS Jagan Mohan Reddy) ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్‌ మార్గాని భరత్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ఢిల్లీ వచ్చారు.

నేడు (అక్టోబర్ 6) ఉదయం 10.40 గంటలకు ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో జరిగే సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర అంశాలపై ప్రధాన మంత్రికి (PM Modi) ముఖ్యమంత్రి నివేదించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఇటీవలి రాజకీయ పరిణామాలతో సహా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 22 మరియు 23 తేదీలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయిన విషయం విదితమే. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయడమే కాకుండా, రాజకీయ పరిణామాలపై చర్చించారు.

సబ్బం హరి వివాదం ముగిసినట్లేనా? సారీ చెప్పిన టీడీపీ అధినేత, అక్రమ నిర్మాణాన్ని మాత్రమే కూల్చేశామని తెలిపిన జీవీఎంసీ అధికారులు

ప్రధానితో సమావేశంలో రాష్ట్రంలో హైకోర్టు తీర్పుల అంశం, గత టిడిపి ప్రభుత్వ అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, ఇటీవల జరిగిన అంతర్వేది రథం కాల్పుల సంఘటనపై కేంద్ర బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన ప్రధానిని కోరే అవకాశం ఉంది. మోడీతో తన సంభాషణలో, జగన్ కేంద్రం నుండి రాష్ట్రానికి పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని కోరుతూ ప్రాతినిధ్యం సమర్పించే అవకాశం ఉంది.

అక్టోబర్ 8న జగనన్న విద్యా కానుక, లాంఛనంగా ప్రారంభించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 42.34 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్‌ కిట్లు పంపిణీ

2,253.52 కోట్ల రూపాయల స్థానిక సంస్థలకు పెండింగ్‌లో ఉన్న 14 వ ఆర్థిక కమిషన్ గ్రాంట్లు, రూ .3,622.07 కోట్ల జీఎస్టీ పరిహారం, పోలవరం బకాయిలు 4,006 కోట్లు, పెండింగ్‌లో ఉన్న 2014-15 రెవెన్యూ లోటు గ్రాంట్ రూ .18,830.87 కోట్లు, పెండింగ్ మూలధనం రూ .1,000 కోట్ల అభివృద్ధి మంజూరు చేయాలని కోరే అవకాశాలు ఉన్నాయి. జగన్ చివరిసారిగా ఫిబ్రవరిలో ప్రధాని మోదీని కలిశారు.

పోలవరం అంచనా వ్యయాన్ని సవరించిన కేంద్రం, రూ.47,725.74 కోట్లకు ఒకే చేసిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బకాయి నిధులు త్వరలో విడుదల

ఈ కార్యక్రమం అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో (Apex Council meeting) ఏపీ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర జల శక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమా వేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.

హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ, రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య చర్చలు, ఏపీలో ఫోరెన్సిక్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని కోరిన విజయసాయి రెడ్డి

కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, బోర్డుల వర్కింగ్‌ మాన్యువల్, రెండు బేసిన్‌లలో నీటి వినియోగం, కృష్ణా బోర్డు ఏపీకి తరలింపు వంటి అంశాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ చర్చించనుంది. ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పూర్తిస్థాయి నివేదికలతో సిద్ధమైంది. ముఖ్యంగా నీటి వినియోగంపై ట్రిబ్యునల్‌ అవా ర్డులు, వాటిపై కుదిరిన ఒప్పందాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులిచ్చిన ప్రాజెక్టుల జీవోలు, వాటి రీ ఇంజనీరింగ్‌ అంశాలతో నివేది కలు సిద్ధం చేసుకుంది.

ఏపీలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు, శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ వంటి ప్రాజెక్టులు పాతవేనని చెప్పేందుకు అవసరమైన రుజువులు, వాటికి ఉన్న నీటి కేటాయింపుల వివరాలతో రెడీ అయింది. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాల్వ వ్యవస్థల విస్తరణపై తమ అభ్యంతరాలు, తెలంగాణకు జరిగే నష్టంపై సోమవారం సైతం సీఎం కేసీఆర్‌ ఇంజనీర్లతో చర్చించారు. ఈ అంశంపై బలంగా వాదనలు వినిపించేలా వ్యూహం సిద్ధం చేశారు. నీటి వాటాల విషయంలో, టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు, ఏపీ కొత్త ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కృష్ణా బోర్డు వైఫల్యాలను ఈ సమావేశంలో సీఎం ఎండగట్టనున్నారు.